Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 592 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 592 మందికి కరోనా సోకింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 27,488 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 477 మంది డిశ్చార్జి అయ్యారు. 553 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,997 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 84 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ లో అత్యధికంగా 331 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 2.15 శాతంగా నమోదయింది.