Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భూకబ్జాదారులకు అండదం దలందిస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తన పదవులకు రాజీనామా చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై ఆయన జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎన్హెచ్ఆర్సీ ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు నోటీసులు జారీ చేసింది. మేడ్చిల్ జిల్లా పోచారం మున్సిపాల్టీలోని కెఎల్ మహేందర్నగర్లో వికలాంగులకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని జడ్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడి నుంచి వికలాంగులను పంపించి విలువైన భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ భూములు వికలాంగులకే చెందాలని డిమాండ్ చేశారు.