Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోయపోషగూడ గిరిజనులపై దాడులు చేసిన అటవీ, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలోని పోడు భూముల్లో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుంటే అటవీ అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని ఆదివాసీ గిరిజనులపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మహిళలనీ చూడకుండా ఈడ్చుకెళ్లి కొట్టడాన్ని తప్పుపట్టారు. ఇది అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. పోడు చేసుకునే గిరిజనులకు హక్కుపత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాంటి నియంత ధోరణులను, దాడులను కొనసాగిస్తే ప్రతిఘటన పోరాటాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు.