Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ, బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెబుతున్నదని సీఎం తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవుని పై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తున్నదని సీఎం కేసిఆర్ అన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందని సీఎం పేర్కొన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి తదితరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.