Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్కువ వడ్డీకే రుణాలు
- రాష్ట్రంలో 56లక్షల మంది సభ్యులు
- ఈ ఏడాది రుణ లక్ష్యం రూ. 3700 కోట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మహిళల సమగ్రాభిóవద్ధికి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయటం, మహిళా సాధికారతే లక్ష్యంగా 'శ్రీనిధి' సంస్ధ పనిచేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులందరికీ జీవనోపాది ద్వారా ఆధాయం పెంపొందించటం, అన్ని రకాల అవసరాలకు సత్వర రుణం పొందుటకు రుణ సహకారం ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి సంస్థను స్థాపించింది. శ్రీనిధి సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మంది సభ్యులు ఉన్నారు 5.50 లక్షల సంఘాలు, 22,300 గ్రామ సమాఖ్యలు, 629 మండల, పట్టణ సమాఖ్యలు భాగస్వామ్యంతో ఉన్న ఏకైక సంస్థ శ్రీనిధి. రాష్ట్రంలో శ్రీనిధి సంఘాల స్ఫూర్తితో బీహార్లో శ్రీనిధి లాంటి సంస్థను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
శ్రీనిది ప్రత్యేకలు..
దేశంలో శ్రీనిధి లాంటి సంస్థ ఎక్కడా లేదు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించటానికి ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. మహిళలు తమ ఇంటి వద్ద ఉండి పని చేసుకునే విధంగా అతి తక్కువ వడ్డీకే (11.5 శాతం) రుణాలు ó ఆ సంస్థ ద్వారా నేరుగా అందిస్తున్నది. పాడి పశువులు, కోళ్ళ పెంపకం, ఎలక్ట్రిక్ ఆటోలు, చిన్న చిన్న షాపులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నది. ఒక్కో మహిళకు తమ ఇంటి వద్ద ఉండి పని చేసుకొనే విధంగా రూ. 5 వేల నుంచి రూ. మూడు లక్షల వరకు రుణాలు అందిస్తున్నాయి.
తక్కువ వడ్డీకే..
మహిళల నుంచి తీసుకునే వడ్డీ, బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కన్నా మూడు శాతం తక్కువ. శ్రీనిధిలో అప్పు పొందేందుకు ఏవిధమైన ఖర్చులు, సేవా రుసుములు ఉండవు. వడ్డీ మార్జిన్, శ్రీనిధి పొందుపులపై ఇచ్చే వడ్డీ వల్ల ఆ సంస్థ నుంచి వచ్చే డివిడెండ్ వల్ల మహిళా సమాఖ్య సంఘాలు లబ్ధి పొందుతున్నాయి. గత ఎనిమిదేండ్ల కాలంలో శ్రీనిధి ద్వారా రూ.14,756 కోట్ల 85 లక్షలు రుణాలు పొందారు. కిరాణం, లాండ్రీ, మొబైల్ ఫోన్ రిపేరింగ్, పౌల్ట్రీ, బేకరీ షాప్, గాజుల దుకాణం, సెలూన్, బ్యూటీ పార్లర్, ఇటుకల తయారీ, ఫోటో స్టూడియో, కార్పెంటరీ, సెంట్రింగ్, ఇంటర్నెట్, పాడి పరిశ్రమ, డెకరేషన్ అండ్ లైటింగ్ సర్వీస్, ఫ్యాన్సీ స్టోర్స్, చేపల అమ్మకం, పేపర్ ప్లేట్లు తయారీ, గొర్రెల పెంపకం, టైలరింగ్ షాపు, కూరగాయల అమ్మకం, వెల్డింగ్, జిరాక్స్ లాంటి 65 రకాల యూనిట్లు ప్రారంభించడానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించారు.
2022-23 శ్రీనిది వార్షిక ప్రణాళిక
2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.3,700 కోట్లను ప్రభుత్వం శ్రీనిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణంగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం రూ.626కోట్లను అధికంగా రుణాలను ఇచ్చి సంఘాలను బలోపేతం చేయనున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 750 కోట్లు ఎస్సీ ఉప ప్రణాళిక క్రింద రూ. 410 కోట్లు ఎస్టీ ఉప ప్రణాళిక కింద, శ్రీనిధి ఉపప్రణాళిక కింద రూ.40.4 లక్షలను ఆయా వర్గాల ప్రత్యేక ప్రణాళిక కింద కేటాయించిన విషయం తెలిసిందే. డెయిరీ, పౌల్ట్రీ యూనిట్ల ఏర్పాటకు, ఎలక్ట్రిక్ ఆటోలకు, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు, గ్రీన్ హౌజ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాట్లకు, ద్విచక్ర వాహనాల రిపేర్లకు, జనరల్ మెడికల్ స్టోర్లు, సోలార్ యూనిట్ల ఏర్పాట్లకు ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు.
పట్టణ వీధి వ్యాపారులకోసం..
పట్టణ ప్రాతంల్లో వీధి వ్యాపారుల స్వయం ఉపాధి కోసం రుణం ఇవ్వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2014-15 నుంచి 2019-20 వరకు రూ. 2,020 కోట్ల 47 లక్షలను శ్రీనిధి లాభంగా పొందింది. ఆ సంస్థó ద్వార సంఘ సభ్యుల సంక్షేమానికి వచ్చే లాభాల్లో 45 శాతం సంఘాల సామార్ధ్యాన్ని పెంపొందించేందుకు, 2 శాతం స్కాలర్షిప్పులుగా అందిస్తున్నది.ఇంటర్ చదివే సంఘం సభ్యుల పిల్లలకు రూ.2,500 స్కాలర్ఫిప్ అందించనున్నది. సురక్ష భీమా పథకం కింద స్త్రీనిధిలో రుణం పొందిన వారు, సురక్ష పథకం కింద స్వయం సహాయక సభ్యులందరికీ ఒక లక్ష వరకు జీవిత భీమా పథకం అమలు చేయబడుతున్నది.