Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిఆర్ఎస్ జిల్లా నాయకులు పొనుగోటి రవీందర్రావు
నవతెలంగాణ-వెల్డండ
కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని, పెంచిన వంట గ్యాస్ ధర లను వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ జిల్లా నాయకు డు పోనుగోటి రవీందర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్దండ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో రవీందర్ రావ్ మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. గ్యాస్ డీజిల్ సిలిండర్ ధరలు రోజు రోజుకు పెరగ టంతో పేద ప్రజలు ఏ విధంగా బతకాలని ప్రధాని మోడీని ఆయన ప్రశ్నించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్, అచ్చేధిన్ అంటు అన్ని రకాల ధరలు పెంచి సచ్చేదిన్ చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వా నికి పేద ప్రజల అవస్థలు పట్టడం లేదా అని ప్రశ్ని ంచారు. నిత్యా వసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు అర్జున్ ఉన్నారు.