Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించిన వీరయోధులకు 'జేసీఐ' సాయమందిస్తున్నదని ఆ సంస్థ అధ్యక్షులు ధన్నారపు రాకేశ్ చెప్పారు. కరోనా వారియర్స్ను ప్రభుత్వం గుర్తించిందనీ, కానీ ప్రజలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సేవలు అందించిన వారిని గుర్తించడం లేదన్నారు. అందులో జర్నలిస్టులు, శ్మశాన వాటికల్లో సిబ్బంది, నర్సులు, విమాన సిబ్బంది, నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన సంస్థలు ఉన్నాయని తెలిపారు. శనివారం హైదరాబాద్లోని నవతెలంగాణ (ఎంహెచ్ భవన్) కార్యాలయంలో జర్నలిస్టులు, సిబ్బందికి వారు స్వయంగా తయారు చేసిన పిండి వంటలను అందించారు. కరోనా సమయంలో తమ సంస్థ దాదాపు 150 దేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నదని తెలిపారు. యువత భాగస్వామ్యంతో నడుస్తున్న తమ సంస్థ అనతికాలంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్నదని అన్నారు. కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్ ఆర్ సుధాభాస్కర్, అసిస్టెంట్ ఎడిటర్ జి వేణుమాధవరావు, సంస్థ ప్రతినిధులు మహిత కందుకూరి, లాస్య కొత్తూరు, సాయిక బీస్వాల్, శిరిషా, సాకేత్ కొత్తూరు, దేవార్ష జెట్టి తదితరులు పాల్గొన్నారు.