Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి అనువైన 18 పంటలకు చెందిన 60 రకాల విత్తనాలు
- ఈ ఏడాది 33,619 ఎకరాలకు 1.60వేల క్వింటాళ్ళ విత్తనాలు ఉత్పత్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయరంగం ముఖ్యభూమిక పోషిస్తున్నది. రైతులు, వ్యవసాయ సమస్యల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం గత అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సాగు విస్తీర్ణం, పంటలు దిగుబడి గణనీయంగా పెరిగింది. 2021-22 అంచనాలు ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 18.3 శాతాన్ని వ్యవసాయరంగం జమ చేసింది. వ్యవసాయరంగంపై 48.4శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్నది. రాష్ట్ర పారిశ్రామిక, సేవా రంగాలకు వ్యవసాయ రంగం ఊతమిస్తున్నది. అందులో భాగంగా స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి దోహదపడే పంటలు, ఆయా ప్రాంతాల భూముల తీరుకు అనువైన రకాల పంటల విత్తనాలను రైతులకు అందించేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధిసంస్థ కషిచేస్తున్నది. సీఎం కె. చంద్రశేఖర్రావు ఆశయాలమేరకు అధిక దిగుబడులు, అత్యధిక ఆదాయాన్నిచ్చే 18 పంటలకు చెందిన 60 రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అభివద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, చీడపీడలను తట్టుకునే రకాలపై ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. 2021-22లో 33,619 ఎకరాల విస్తీర్ణంలో 1,60,441 క్వింటాళ్ళ విత్తనాలను సంస్థ ఉత్పత్తి చేసింది. విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తున్న పంటల రకాల్లో ప్రధాన పంటలు అయిన వరి, మిర్చి, పత్తితోపాటు వేరుశనగ, కంది, మొక్కజొన్న, రాగి, కొర్రలు తదితర పంటల విత్తనాలున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి కృషితో వైవిధ్యమైన లాభదాయక పంటలు సాగు వైపు తెలంగాణ రైతులు మళ్ళుతున్నారు. రాష్ట్ర రైతులతోపాటు దేశంలో వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్, ఛత్తిష్గడ్, ఉత్తరప్రదేశ్, ఓడిశా రాష్ట్రాలకు వివిధ రకాల విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎగుమతి చేస్తున్నది. అధిక దిగుబడులు ఇచ్చే వైవిధ్య పంటలు సాగును ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశ రైతాంగానికి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంగా నిలుస్తున్నది.ఈమేరకు పౌర,సమాచార శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.