Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసు విషయంలో తనని ఆశ్రయించిన బాధితులను మానసికంగా శారీరకంగా వేధించడం దుర్మార్గమని తెలిపారు.
ఈ ఘటన పూర్వపరాలను మరింత లోతుగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. సీబీఐ ద్వారా విచారణ జరిపిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు 2018 నుంచి . ఒక మహిళను వేధింపులకు గురిచేసి అనేకమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా వార్తలు వస్తున్నాయనీ, మరో పక్క ఈ కేసు వెనక కొంతమంది కుట్ర ఉన్నదని వార్తలొస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవాలు బైటపెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులైన మహిళలను వివాదంలోకి లాగడం సరికాదని తెలిపారు.