Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో వేసిన కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ రాలేదని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2021లో తమ సంఘం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై హెచ్చార్సీలో పిటీషన్ వేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై పలుమార్లు సంప్రదింపులు జరిగాక, కొన్ని సమస్యల్ని పరిష్కరించినట్టు యాజమాన్యం హెచ్చార్సీకి నివేదిక సమర్పించిందనీ, మిగిలిన సమస్యల్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.