Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనార్టీల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం సబ్సిడీ రుణాలిస్తున్నదని పేర్కొన్నారు.వారి సంక్షేమ, అభివృద్ది కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 9వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం చేయూతనివ్వాలనీ, బ్యాంకుల సహకారంతో సబ్సిడీపై మొత్తం 5వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించామన్నారు. ఇందుకు గాను రూ. 50కోట్లు కేటాయించినట్టు తెలిపారు.