Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న విద్యాభవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ సి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 30న నిర్వహించిన పాలిసెట్ రాతపరీక్షకు 52,689 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 48,031 (92.02 శాతం) మంది పరీక్ష రాశారు. 61,290 మంది అబ్బాయిలు దరఖాస్తు చేయగా, 56,401 (91.16 శాతం) మంది వచ్చారు. మొత్తం 1,13,979 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, 1,04,432 (91.62 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.