Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాలతో మొలక దశలోనే పంటలు దెబ్బతిన్నాయనీ, దీంతో రైతులపై విత్తన భారం పడనుందని కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేట అన్వేష్రెడ్డి తెలిపారు. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రైతులు మళ్ళీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇవ్వకపోవడం వల్ల అన్నదాతలపై భారం పడిందని తెలిపారు.