Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి వేముల ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధిక వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫోన్లో సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశిం చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. అలుగు పారుతున్న చెరువుల వద్దకు, పొంగి పొర్లుతున్న కల్వర్టుల వద్దకు కొంత మంది ఆసక్తితో చూడ డానికి వెళ్తున్నారనీ, అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు. అందువల్ల అక్కడికి వెళ్లే వారిని నియంత్రించాలని సూచించారు. అన్ని శాఖలను ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని సూచించారు.