Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్ రాత పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. అధిక వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న మూడురోజులపాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా వేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో సమీక్షించి గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పరీక్షలను మాత్రమే వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఈనెల 18 నుంచి 20 వరకు షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.