Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకు సరిపడా బొగ్గును నిల్వ చేయండి..
- విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూడండి
- వర్షాలు, వరదలపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు
- విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తున్నామని వెల్లడి
- 18న పున: ప్రారంభం- జీవో జారీ
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటం, వాగులు వంకలు, రిజర్వాయర్లు నదులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో తక్షణ రక్షణ చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భారీ వరదల వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలైనంత మేరకు తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. వరదల నేపథ్యంలో రెండు రోజుల నుంచి సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం... బుధవారం కూడా హైదరాబాద్లోని ప్రగతి భవన్లో తాజా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగింది.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎగువన భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సారెస్పీ వంటి పలు రిజర్వాయర్ల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకోసం చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నారు. మహారాష్ట్రలో ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టాల్సిన ముందస్తు చర్యలకు సంబంధించి ఫోన్లో ఆదేశాలిచ్చారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా ఆయా శాఖలు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్న క్రమంలో... ఆ ప్రాజెక్టు దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు ముంపునకు గురవుతున్న 12 గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అక్కడే ఉండి రక్షణ చర్యలు చేపట్టాలంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని సీఎం ఫోన్లో ఆదేశించారు. నిర్మల్ సహా వరద ముంపునకు గురవుతున్న నదీ పరివాహక ప్రాంత పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ఆదేశించారు. వరదల వల్ల తెగిపోతున్న జాతీయ, రాష్ట్ర (మొదటిపేజీ తరువాయి)
రహదారుల పునరుద్ధరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సూచించారు. ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చారు. భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడే ఉండి ఏర్పా ట్లను పర్యవేక్షించాలంటూ మంత్రి పువ్వాడ అజయ కుమా ర్కు సీఎం సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశించారు. వరదల నేపథ్య ంలో రాష్ట్రంలో పంటలు, చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితిపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో సీఎం సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్త నాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
పునరుద్ధరణ పనులు చేపట్టండి...
రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలనీ, విద్యుత్ ఉత్పాదనకు వీలుగా మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీలు ప్రభాకరరావు, రఘుమారెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్ను సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు 2,300 విద్యుత్తు స్థంభాలు కూలిపోయాయనీ, వాటిలో 1,600 స్థంభాల వరకూ పునరుద్ధరించామని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. మిగతా వాటి పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. విద్యుత్తు సరఫరాకు అంతరా యాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాల ద్వారా కరెంటును పునురుద్ధరిస్తున్నామని తెలిపారు. ప్రాజె క్టులకు విపరీతంగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో అవకా శమున్న చోటల్లా హైడల్ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రా రంభించాలని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. వానలు, వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశిం చారు. వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్య లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దనీ, రక్షణ చర్యలకు సంబంధించి ప్ర భుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన రాష్ట్ర ప్రజ లకు విజ్జప్తి చేశారు. సమీక్షా సమావేశం నుంచే వరద ముం పు అధికంగా ఉన్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఫోన్లో వివరాలు అడిగి తెలు సుకున్న సీఎం... పలు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థి తుల్లోనూ పరిస్థితులు చక్కబడేవరకు వారి వారి నియోజక వర్గాలు, జిల్లాలు విడిచి వెళ్లొద్దని వారికి సూచించారు.
సెలవులు పొడిగింపు...
భారీ వర్షాలు నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికా రులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.