Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నడిపొల్ల స్వామి (37) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణానికి, వ్యవసాయానికి అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురై ఇంటి పరిసరాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు స్వామిని మెదక్ జిల్లా రామాయంపేట ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియాస్పత్రికి తరలించారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ ఆనంద్గౌడ్ తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.