Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిత్యావసర సరుకులు, విద్యార్థుల నోట్ పుస్తకాలు, పెన్నులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో అధిక భారాన్ని మోపడాన్ని ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు జూపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి మహేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలు, పెరుగు, గోధుమలు, బియ్యం, గృహ అవసరాలైన వాటర్ హీటర్స్, ఎల్ఈడీ బల్బులు, విద్యార్థులు ఉపయోగించే నోట్ పుస్తకాలు, పెన్నులు తదితర వస్తువులపై జీఎస్టీ పేరుతో అధిక పన్నుల భారాన్ని మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మోడీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లుగా ప్రజలపై అధిక పన్నుల భారాన్ని మోపుతూ... కార్పొరేట్లకు రాయితీలిస్తున్నదని వివరించారు.