Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు మంగళవారం రెండోరోజు 58,376 మంది విద్యార్థులకు కేటాయించగా, వారిలో 52,796 (90.4 శాతం) మంది హాజరయ్యారు. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం తొలి విడతకు 28,812 మందిని కేటాయిస్తే, 26,289 (91.2 శాతం) మంది పరీక్ష రాశారని తెలిపారు. మధ్యాహ్నం రెండో విడతకు 29,564 మందికి కేటాయించగా, వారిలో 26,507 (89.7 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు.