Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అరిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జునఖార్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2009 ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, రోహిణ్రెడ్డి తదితరులు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గం బీజేపీ నేతలు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు.
గంట సత్యనారాయణరెడ్డిపై సస్పెన్స్ ఎత్తివేత
మాజీ పీసీసీ కార్యదర్శి గంట సత్యనారాయణరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మెన్ జి చిన్నారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.