Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వబ్రాహ్మణల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ఉప్పల్ భగాయత్లో ఐదెకరాల భూమిని కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్.ఉపేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరిశంకర్ తదితరులతో కలిసి సదరు భూమిని సందర్శించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే కాలంలో గ్రామీణ పేద విద్యార్ధుల విద్య, పేదింటి ఆడబిడ్డల కల్యాణం కోసం, పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం, పేద విద్యార్థి విద్యార్థినుల స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.