Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల భూమితోపాటు భద్రాచ లం, పర్ణశాల సైతం మునిగిపోతాయని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై ఆయన బుధవారం సమీ క్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రా జెక్టులు, భద్రాచలంకు వాటిల్లి న ముప్పు, భద్రతా అంశాలపై రజత్ కుమార్ ఉన్నతాధికారులతో సమ గ్రంగా చర్చించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతు లు చేయడం మూలంగా ఎలాంటి ప్రమాదం జరగ లేదన్నారు. గడిచిన 100 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా కడెం ప్రాజెక్టు ఎగువన భారీ వర్షం కురి సిందని తెలిపారు. వరదలు, వర్షాలను ఎదుర్కొనేం దుకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదనడం సరైంది కాదన్నారు. వరద నష్టం అంచనాలపై జరుగు తున్న ప్రచారం నిరాధారమని అని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీతోపాటు 18 విభాగాల అనుమతి త ర్వాతనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. పోలవరంతో లక్ష ఎకరాల వరకు మునిగి పోతాయనీ, బ్యాక్వాటర్తో పంట నష్టంతో పాటు చారిత్రా త్మక ప్రాంతాలకు ముప్పు ఉందని అభిప్రాయపడ్డారు. పోలవరం బ్యాక్వాటర్ విషయం లో అధ్యయనం చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశామనీ, బ్యాక్ వాటర్ నష్టం, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వరదలతో కాళేశ్వ రం ప్రాజెక్టుకు సుమారు రూ. 20 నుంచి 25 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఒప్పంధంలో భాగంగా ఆ నష్టాన్ని నిర్వహణా సంస్థలే భరించాల్సి ఉంటుందన్నారు. 45 రోజుల్లో మరమ్మత్తుకు గురైన కాళేశ్వరం పంప్హౌస్ల పనులు పూర్తవుతాయని తెలియజేశారు.