Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరు గుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు తీసుకురానున్నారు. అనుమానితుల రక్తం, మూత్రం, గొంతు నుంచి ఐదు రకాల నమూనాలను సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపు తారు. ఫలితాల్లో అనుమానాలుంటే శాంపిల్స్ను మరోసారి పుణెకు పంపను న్నారు. వ్యాధి నిర్ధారణ అయితే అక్కడి వార్డులో ప్రత్యేక చికిత్స అందించ నున్నట్లు ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శంకర్ తెలిపారు.