Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సంక్షేమశాఖ కార్యదర్శికి మంత్రి హరీశ్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్కు ఆయన సూచించారు. రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ల ప్రతినిధులు హరీశ్ రావును గురువారం కలిశారు. తమ సమస్యల గురించి ఆయనతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. వైద్యం, ఉపాధి, ఇతర అవకాశాల విషయంలో అందరికి సమాన హక్కులుంటాయనీ, ఈ విషయంలోట్రాన్స్ జెండర్లు అన్ని విధాల అర్హులని చెప్పారు. నివేదిక వచ్చాక సీఎం కేసీఆర్కు సమర్పించి, కేబినెట్ ద్వారా ట్రాన్స్ జెండర్ల ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రయోజనం చేకూర్చేలా చూస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రిజ్వీ, డీఎంఇ రమేష్ రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.