Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత ప్రాక్టీస్ వర్క్షాప్ను ఈనెల 24న (ఆదివారం) ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెప్ పి క్రిష్ణప్రదీప్ తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో అకాడమి సెమినార్లో జరిగే ఈ వర్క్షాప్లో ప్రాక్టీస్ వర్క్బుక్ ద్వారా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో వచ్చే మాదిరి ప్రశ్నలను ఇస్తామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటికి జవాబు రాసే విధానాన్ని వివరిస్తామని తెలిపారు. జీఎస్, సీశాట్, కరెంట్ అఫైర్స్ వంటి సబ్జెక్టులపై ప్రాక్టీస్ బుక్ ద్వారా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.