Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా శుక్రవారంతో ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు 19,163 మంది హాజరయ్యారని వివరించారు. శుక్రవారం 7,134 మంది వచ్చారని తెలిపారు. ఈనెల 25 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6,686 వెబ్ఆప్షన్లు నమోదయ్యాయని వివరించారు. ఓ అభ్యర్థి అధికంగా 272 ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 54 ప్రభుత్వ కాలేజీల్లో 11,892 సీట్లు, ఒక ఎయిడెడ్ కాలేజీలో 230 సీట్లు, 58 ప్రయివేటు కాలేజీల్లో 14,700 సీట్లు కలిపి 113 పాలిటెక్నిక్ కాలేజీల్లో 26,822 సీట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇతర వివరాలకు https://tspolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.