Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2022-24 బ్యాచ్ ప్రవేశాల కోసం డీసెట్ రాతపరీక్ష శనివారం జరగనుంది. తెలుగు మాధ్యమానికి 4,967 మంది, ఆంగ్ల మాధ్యమానికి 5,348 మంది, ఉర్దూ మాధ్యమానికి 1,365 మంది కలిపి మొత్తం 11,680 మంది దరఖాస్తు చేశారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెలుగు మాధ్యమం, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. తెలుగు మాధ్యమం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమం విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉన్నది. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.