Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో తన సతీమణి మాధవితో కలిసి శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ మొక్కలు నాటారు. తెలంగాణ పచ్చదనంతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటానని వివరించారు. ఇందులో తనను భాగస్వామిని చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.