Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
శ్రీశైలంలోని టీఎస్జెన్కో అండర్ గ్రౌండ్ హైడ్రో పవర్ స్టేషన్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. హైడ్రో పవర్ స్టేషన్ పనితీరు గురించి శ్రీశైలం పవర్ హౌస్ చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి వివరించారు. గతంలో ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి, ఉద్యోగులు మరణించిన విషయం తెలిసిందే. పవర్ హౌస్ లోని మొత్తం ఆరు యూనిట్లలో ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని, త్వరలోనే ఆరవ యూనిట్ కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ తెలిపారు. పవర్ స్టేషన్ పనితీరు పట్ల వినోద్ కుమార్ సంతప్తి వ్యక్తం చేశారు.