Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ బాధ్యత పెంచేలా ఫారెస్ట్ పార్కులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెరిగిన పట్టణ ప్రజల అవసరాలకు తగట్టుగా భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో ఉంచుకుని ఆహ్లదకర వాతావరణంతో పర్యావరణ హితం కల్గించేలా రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్దికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కలతోపాటు, రాష్ట్రమంతటా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నది. గ్లోబల్ సీటీ హైదరాబాద్ నగరానికి పర్యావరణ అవసరాలు తీరేలా మొదటి దశలో 109 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధికి చర్యలు తీసుకుంది. అటవీ బ్లాకుల అభివృద్ధికి వీలుగా వివిధ సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 59 పూర్తి కాగా, మిగిలిన 50 వివిధ దశలో ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 59 పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 39 పార్కులు ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని పార్కులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. మరో 20 వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 59లో అటవీశాఖ 27, హెచ్ఎండీఏ 16, టీఎస్ఐఐసీ 7, ఎఫ్డీసీ 4, జీహెచ్ఎంసీ 3, మెట్రో రైల్ 2 పార్కులను అభివృద్ది చేస్తున్నాయి. ప్రతీ అర్బన్ ఫారెస్ట్ పార్కులో తప్పని సరిగా ఎంట్రీ గేట్, వాకింగ్ పాత్, వ్యూ పాయింట్ ఏర్పాటు మొదటి దశలో ఉండాలనే ఉద్దేశంలో అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడలు నిర్మిస్తున్నారు. తర్వాత దశలో పిల్లల ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం లాంటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. పార్కు ఏర్పాటు కాకుండా మిగతా అటవీ స్థలాన్ని అంతటినీ కన్జర్వేషన్జోన్గా పునరుద్దరణ కార్యక్రమాలు, జీవవైవిధ్యం, నీటి వసతి పెరిగే కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. హరితవనాల పేరుతో కన్జర్వేషన్ జోన్లలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్కక్రమం కొనసాగుతున్నది. వందశాతం చిక్కటి అడవి పెరిగేలా, స్థానిక స్థలం, మట్టి స్వభావం, వాతావరణ పరిస్థితి ఆధారంగా పెరిగే మొక్కలను మాత్రమే నాటుతున్నారు. అర్బన్ పార్కులను గాంధారి వనం, ప్రశాంతి వనం, అక్సిజన్ పార్క్, శాంతి వనం, ఆయుష్ వనం, పంచతత్వ పార్క్ తదితర ధీములతో అభివృద్ధి చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన హైదరాబాద్ నగరంలో ఫారెస్ట్ కవర్ 33.15 చ.కి.మీ నుంచి 81.81 చ.కి.మీ(147 శాతం) పెరిగింది. తద్వారా పర్ క్యాపిటా ఫారెస్ట్ కవర్ 4.3 నుంచి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అబివృద్ధిని వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించడం హైదరాబాద్ నగరానికి గర్వకారణం. హైదరాబాద్ నగరంలో పచ్చదనం పెంపుదలతోపాటు కాలుష్యం బారిన పడకుండ ఆటవీశాఖ, మున్సిపల్శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి ఎఫ్ఏఓ నుంచి ట్రీ సిటీ ఆప్ ద వరల్డ్ ట్యాగ్ లభించడానికి విశేషంగా కషిచేశారు. 10శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించడంతోపాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సీడీఎంఏ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు నర్సరీల పెంపుకు ప్రాధాన్యతనిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అవెన్యూ,మల్టీలేయర్, సెంట్రల్ మీడియన్లు నోడ ల్స్, శ్మశానాలు, కాలనీలు,చెరువులు, ఖాళీస్థలాలు వంటి ప్రాంతాలు మొక్కలు నాటారు. సీడీఎంఏ ద్వారా పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ పట్టణ ప్రకృతి వనాలు, ఎంఎల్ఏపీ (మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్), హెచ్ఎండీఏ ద్వారా డ్రిప్, రోటరీలు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే కారిడా ర్,సర్వీస్ రోడ్స్ వెంబడి పచ్చదన అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కులు పట్టణ ప్రాంతాలకు స్వచ్చమైన ఆక్సిజన్ను అందించే అర్బన్ లంగ్స్ స్పేస్ సెంటర్స్గా మారుతున్నాయనడంలో అతిశయోక్తిలేదని సీఎం కేసీఆర్ అన్నారు.