Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సహకార సంస్థకు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''గిరి నేచర్'' అనే పేరుతొ స్వచ్ఛమైన తేనెను తెలంగాణా గిరిజన సహకార సంస్థ ప్రారంభించింది. ఈ గిరిజన స్వచ్ఛమైన తేనె ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జోంగ్తు శనివారం అందచేశారు. ఈ ఉత్పత్తుల్లో మొదటిసారిగా మామిడి, వేప తేనె, నువ్వుల తేనె, పాల కొడిశ తేనెలను వేర్వేరుగా విక్రయిస్తోంది. రాష్ట్రంలో ఫ్లిప్ కార్డు, క్యూ- మార్ట్ల ద్వారా ఈ తేనె ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయవచ్చని క్రిస్టినా జోంగ్తు తెలిపారు. ఇప్పటివరకు గిరిజనులు ముఖ్యంగా చెంచు గిరిజనులు కిలో తేనెకు రూ. 220 లు పొందే వారనీ, దీంతో 54 శాతం అదనపు ఆదాయాన్ని వారు పొందుతారని సీఎస్ కు వివరించారు. కాగా, గిరిజనుల ఆదాయాన్ని పెంచటమే గాక, ప్రజలకు మరింత స్వచ్ఛమైన తేనె ఉత్పత్తులను అందుబాటులో తేవటంపట్ల గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సహకార సంస్థను సీఎస్ అభినందించారు. వీటిని ఏవిధమైన రసాయనాలతో ప్రాసెస్ చేయకుండా స్వచ్ఛమైన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో తేవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య పరమైన లాభాలుంటాయి.వివరించారు. ఈ తేనెలు పాలీఫెనాల్స్ అని పిలువబడే విభిన్న బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయనీ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ యాంటీఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. జలుబు, గొంతు నొప్పి, చర్మ వ్యాధుల నివారణకు తేనే మంచి ఔషధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.