Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబ్సైట్లో విద్యార్థుల హాల్టికెట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంగళవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వివరించారు. కాలేజీ లాగిన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయనీ, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించి వాటిని తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే.