Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
పిరమిడ్ ధ్యాన గురువు సుóభాష్ పత్రిజీ (74) ఆదివారం మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు, కుటుంబ సభ్యుల సలహా మేరకు రెండు రోజులుగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్లోని ధ్యాన కేంద్రానికి తరలించారు. కాగా, ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న స్థానికులు, ధ్యానులు పెద్ద ఎత్తున మహేశ్వర మహా పిరమిడ్కు చేరుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్ సొసైటీ సభ్యులు తెలిపారు.