Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపం ప్రకటించిన సీపీఐ నేత నారాయణ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు తుళ్లూరి తులసమ్మ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తమ సంతాపాన్ని తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల ఎంపీపీగా పనిచేశారని తెలిపారు. ఆ క్రమంలో ప్రజాసమస్యలను పరిష్కరించటంలో అత్యంత శ్రద్ధ వహించేవారని గుర్తుచేశారు.