Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పట్ల రాష్ట్ర సర్కారు నిరంకుశ వైఖరిని విడనాడాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.విజయ్ కన్నా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారని తెలిపారు. వీసీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ నిర్బంధాన్ని విధించడం సరికాదని పేర్కొన్నారు. తమ పిల్లలు ఉద్యమంలో పాల్గొనబోరని వారి నుంచి హామీ తీసుకున్నారని విమర్శించారు.