Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వపై అక్రమంగా ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుచేసింది. ఏపీ ప్రభుత్వం బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. విభజన చట్టానికి విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు చేపట్టడం సరికాదని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ చర్యలతో నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఇబ్బంది ఏర్పడుతున్నదని చెప్పింది.