Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వి హబ్ శిక్షణతో పలు బృందాలు స్టార్ట్ కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగాయి. వి అల్ఫా కార్యక్రమంతో కాలేజీ విద్యార్థుల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆరు ఇంజినీరింగ్, ఆర్ట్స్ కాలేజీల నుంచి 12 బృందాలను ఎంపిక చేసిన ఆ సంస్థ ఎనిమిది వారాల పాటు శిక్షణనిచ్చింది. అనంతరం డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వద్ద అంకుర సంస్థలను ప్రారంభించేందుకు నమోదు చేయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వి హబ్ సీఈవో దీప్తి రావుల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థు లను అభినందించారు. తదుపరి శిక్షణ కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 15లోపు విహబ్కు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఒక ప్రకటనలో కోరింది.