Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం నుంచి మరో ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులు(అటవీ ఉద్యానవనాలు) అందుబాటులోకి రానున్నాయి. వాటిని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలున్న నగరంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు నాగారం, 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీ నగర్, మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూర్, 12.40 గంటలకు మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్లను వారు ప్రారంభిస్తారు.