Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పార్లమెంటు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన కేంద్ర హౌంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాత అంటే 2031 సంవత్సరం తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయమన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను పెంచినట్టుగానే తెలుగు రాష్ట్రాల్లోనూ పెంచాలని కోరారు.