Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మెన్ ప్రీతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దళిత బంధు పథకం అమలులో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మెన్ నాగరిగారి ప్రీతం డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ కనుకమల్లి విజయ 23 మంది కుటుంబ సభ్యులను లబ్ధిదారులుగా చేర్చి 2.27 కోట్లు వారికి కేటాయింపజేశారని గుర్తు చేశారు. ఈ అంశంపై తక్షణం సమగ్రంగా సమీక్ష నిర్వహించాలనీ, లబ్దిదారుల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.