Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు 90 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ రాతపరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ కె రాజిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలు కలిపి 37,253 మందికి కేటాయించగా, 33,495 (89.91 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు. 3,758 (10.09 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఉదయం తొలివిడతకు 18,541 మందికి కేటాయించగా, 16,597 (89.52 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. 1,944 (10.48 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారనీ, ఈ కార్యక్రమంలో కేయూ వీసీ టి రమేష్, రిజిస్ట్రార్ బి వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారని తెలిపారు. గురువారం సైతం ఈ రాతపరీక్షలు జరగనున్నాయి.