Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ యాంత్రీకరణకు తమ ప్రభుత్వం తగిన ప్రోత్సహమిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సాగునీటి రాకతో తెలంగాణ కూలీలంతా రైతులుగా మారారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో శుక్రవారం గుజరాత్ రాజ్కోట్లోని శక్తిమాన్ ఇండిస్టీని మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, అగ్రోస్ ఎండీ రాములు, అగ్రోస్ జీఎం రాజమౌళి సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కూలీల కొరత తీవ్రంగా ఉన్నదనీ, యూపీ, బీహార్, చత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారని తెలిపారు. వ్యవసాయంలో వీలైనంత తొందరగా రైతాంగాన్ని యాంత్రీకరణ వైపు మళ్లించాల్సిన అవసరముందని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయ పరికరాలు తయారు చేస్తున్న శక్తిమాన్ ఇండిస్టీని పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమ స్థాపిస్తే ప్రభుత్వపరంగా భూమి కేటాయింపు, అన్ని రకాల అనుమతులు, ఇతర సహాయ, సహకారాలు అందిస్తామంటూ వారికి హామీ ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు.