Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 90.56 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ రాతపరీక్షలు గురువారం ముగిశాయి. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ కె రాజిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఐసెట్కు మొత్తం 75,952 మంది దరఖాస్తు చేయగా, 68,781 (90.56 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని వివరించారు. 7,171 (9.44 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు. గురువారం ఉదయం తొలివిడతకు 19,294 మందికి కేటాయించగా, 17,544 (90.93 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. 1,750 (9.07 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండో విడతకు 19,405 మందికి కేటాయిస్తే, 17,742 (91.43 శాతం) మంది పరీక్ష రాశారని తెలిపారు. 1,663 (8.57 శాతం) మంది పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.