Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి నివేదిక.
- జాతీయ మహిళా కమిషన్కు నివేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళా కమిషన్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలపై జాతీయ మహిళా కమిషన్కు నివేదిక అందించామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పట్నంలో జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణతో పాటు14రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్రంలో మహిళల కోసం నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. జిల్లాల వారీగా లింగ వివక్షత, సైబర్ క్రైమ్స్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపు లు,మహిళా సాధికారత, లింగ సమానత్వం, ఋతు చక్రం సమయంలో పరిశుభ్రత పాటించడం, గృహ హింస నిరోధక చట్టం తదితర మహిళా అంశాలు,చట్టాలపై అవగా న కల్పిస్తున్నామని తెలిపారు.మహిళా సాధికారత,వారి రక్షణ, అభ్యున్నతిపై కూడా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నా రు.మానవ అక్రమ రవాణాపై చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.మహిళలకు చేరువగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533,ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా మహిళా కమిషన్కి వస్తున్న ఫిర్యాదులు గురించి వివరించారు.మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జాతీయ మహిళా కమిషన్ సారథ్యంతో న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడాని కి వీలుగా 'లీగల్ సెల్' ను ప్రారంభించామన్నారు. జిల్లాలోని బాలికల హాస్టళ్లు, కళాశాలలు, ఆస్పత్రుల్ని ఆకస్మిక తనిఖీ చేస్తామని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎన్జీవోలతో కలిసి ' బుధవారం వాక్' పేరుతో ప్రతి వారం గ్రామాల్లో లింగ వివక్షపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కొమ్ము ఉమాదేవి యాదవ్ , గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతిరావు, కార్యదర్శి కృష్ణ కుమారి పాల్గొన్నారు.