Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేచర్ క్యూర్ ఆస్పత్రికి రూ.6 కోట్లు కేటాయింపు
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రకృతి వైద్యానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దీనికోసం గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రిని అన్ని రకాలుగా అభివద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు రూ.6 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇప్పటికే విజయవాడలోని మంతెన సత్యనారాయణ ప్రకతి వైద్యశాలను అధికార బందం అధ్యయనం చేసి వచ్చింది. ఈ నివేదికపై అరణ్య భవన్ లో శనివారం ఆరోగ్య శాఖ మంత్రితో ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి , హెల్త్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్రెడ్డి , నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్లు, ఆఫీసర్లు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకతి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా, హైదరాబాద్కే వచ్చేలా, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులను ఆకట్టుకొనేలా గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని చెప్పారు. నేచర్క్యూర్లో ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. వైద్యానికి తగినట్టు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. ప్రత్యేక భోజనం కోసం వంట గది, ఇతర సామగ్రినీ సమకూర్చాలనీ, వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని ఆదేశించారు.