Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
ఈనెల రెండున ధ్రువపత్రాల పత్రాల పరిశీలన నిర్వహిస్తామనీ, ఈనెల మూడు వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈనెల ఆరున తుదివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు https://tspolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.