Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల పదో తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు 55,662 మంది విద్యార్థులు హాజరవుతారు. వాటి నిర్వహణ కోసం 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 204 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 204 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 2010 మంది ఇన్విజిలేటర్లను అధికారులు నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం 42 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.