Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూరాలకు పెరిగిన వరద
నవతెలంగాణ - ధరూర్
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 62 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. జలాశయ నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.612 టీఎంసీల నీరుంది. 39.351 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి యూనిట్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి యథావిధిగా నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు-1కు0 క్యూ సెక్కులు, భీమా లిఫ్టు -2కు 750 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1060 క్యూసెక్కులు, కుడి కాల్వకు 508 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 1310 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 0 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తంమీద జూరాల నుంచి దిగువకు 71,029 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు.