Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొన్నాల లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరస్కరించడం దురదృష్టకరమని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఎనిమిదేండ్ల తర్వాత రద్దు చేసిందనీ, తమకేం బాధ్యత లేనట్టు టీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పనకు ఉన్న అవకాశం పోయిందన్నారు. కేంద్రం తిరస్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వమైనా గత ఎనిమిదేండ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఒక్క చుక్క నీరు రాని కాళేశ్వరానికి కేంద్రం నిధులివ్వకపోయినా పూర్తి చేసినట్టు ఐటీఐఆర్ను ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.