Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన అగ్రికల్చర్ విభాగం పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం రాతపరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్రికల్చర్ పరీక్షలకు 94,476 మంది దరఖాస్తు చేయగా, 80,575 (85.3 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. ఆదివారం 48,005 మందికి కేటాయించగా, వారిలో 41,234 (86.1 శాతం) మంది పరీక్షలు రాశారని పేర్కొన్నారు. ఉదయం తొలివిడతకు 24,219 మందికి కేటాయిస్తే, వారిలో 21,029 (86.8 శాతం) మంది హాజరయ్యారని వివరించారు.